• డాగ్ స్క్వాడ్ బలోపేతం* విశాఖ | *మంగళగిరి పోలీస్ హెడ్ క్వార్టర్స్ నుండి జిల్లాకు చేరుకున్న రెండు నూతన జాగిలాలు*
*జాగిలాలను పరిశీలించిన జిల్లా ఎస్.పి శ్రీ సిద్దార్థ్ కౌశల్ ఐ.పి.ఎస్ గారు* కడప అక్టోబర్ 12: కేసుల ఛేదనలో, నేరస్థులను గుర్తించడంలో కీలకపాత్ర పోషించే జిల్లా పోలీస్ శాఖ డాగ్ స్క్వాడ్ బృందంలో మరో రెండు జాగిలాలు చేరి మరింత బలోపేతం అయింది.
ఈ నేపథ్యంలో గురువారం మంగళగిరి హెడ్ క్వార్టర్స్ లో 8 నెలల శిక్షణ పొంది జిల్లా పోలీస్ కార్యాలయానికి రెండు నూతన జాగిలాలు రూబీ, డయానా చేరుకున్నాయి.
జిల్లా ఎస్.పి శ్రీ సిద్దార్థ్ కౌశల్ ఐ.పి.ఎస్ గారు జాగిలాలను పరిశీలించి డాగ్ స్క్వాడ్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. కేసుల ఛేదనలో కీలకమైన జాగిలాల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు.
జిల్లాకు కేటాయించిన జాగిలాలతో డాగ్ స్క్వాడ్ మరింత సమర్ధవంతంగా విధులు నిర్వర్తించేందుకు దోహదపడుతుందన్నారు. జాగిలాలతో మొత్తం డాగ్ స్క్వాడ్ సంఖ్య 8 కి చేరుకుంది.
ప్రస్తుతం కేటాయించిన వాటిలో ఒకటి కాకర్స్ స్పానియల్ జాతికి చెందినది కాగా, రెండోది బెల్జియం మలనాయిస్ జాతికి చెందినది. కాకర్స్ స్పానియల్ పేలుడు పదార్థాలను పసిగట్టడంలో దిట్ట.
బెల్జియం మలనాయిస్ హత్య, దొంగతనాల నేరాలకు పాల్పడ్డ నేరస్థులను గుర్తించడంలో నేర్పరి. కార్యక్రమంలో ఏ.ఆర్ అదనపు ఎస్.పి ఎస్.ఎస్.ఎస్.వి కృష్ణారావు, ఏ.ఆర్ డి.ఎస్.పి బి. రమణయ్య, ఆర్.ఐ లు వీరేష్, సోమశేఖర్ నాయక్, ఆనంద్, డాగ్ స్క్వాడ్ సిబ్బంది ఎ.ఆర్ హెడ్ కానిస్టేబుల్ పి. సునీల్ కుమార్, కానిస్టేబుళ్ళు డి. పీరయ్య, ఆర్. రామమోహన్ రెడ్డి, యు. మాబుసేన్, డి. శ్రీనివాసులు పాల్గొన్నారు.